హ్యూమన్ రైట్స్ టుడే/ ఆంధ్రప్రదేశ్/ మార్చి 03: విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అత్యంత కీలకమైన 8 ఫైళ్ళు గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. గతంలో పని చేసిన ఈవోల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గళ్లంతైన ఫైళ్ల వ్యవహారంపై ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ సంబంధిత విభాగాలకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఈవో ఫైళ్లను పరిశీలించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
